Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూన్ 30లోగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే..?

pan card link
, శుక్రవారం, 16 జూన్ 2023 (19:03 IST)
పాన్-ఆధార్ అనుసంధానానికి జూన్ 30 చివరి తేదీ అని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం, మినహాయింపు కేటగిరీ కిందకు రాని పాన్ హోల్డర్లందరూ తమ పాన్ నంబర్‌ను 30.06.2023న లేదా అంతకు ముందు ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. 
 
నిర్దిష్ట తేదీలోగా తమ ఆధార్- పాన్‌లను లింక్ చేయకుంటే పన్ను చెల్లింపుదారులు ఎదుర్కోవాల్సిన శిక్షా చర్యలను కూడా దానితోపాటు ఉన్న నోటిఫికేషన్‌లో ఆదాయ పన్ను శాఖ వివరించింది. 
 
జూన్ 30లోగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే, పాన్ డీయాక్టివేట్ చేయబడుతుంది. అందువల్ల పన్ను మినహాయింపు (TDS), పన్ను వసూలు (TCS) రెండూ తీసివేయబడతాయి.
 
పెండింగ్‌లో ఉన్న రీఫండ్‌లు, వాపసులపై వడ్డీ కూడా మంజూరు చేయబడదు. దీంతో పాటు పాన్‌ నంబర్‌ను ఆధార్‌తో లింక్‌ చేస్తే జరిమానాను పెంచనున్నట్లు తెలిసింది. 
 
ఆధార్‌తో లింక్ చేయకుండా పాన్‌ను ఉపయోగించినందుకు రూ.10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కాబట్టి, ప్రజలు ఆలస్యం చేయకుండా వెంటనే పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో పనిచేసేందుకు అత్యుత్తమ కంపెనీలలో టాప్ 5గా నిలిచిన సింక్రోనీ