Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోడలితో ఆ సంబంధం.. కొడుకును ఏం చేశాడంటే?

కోడలితో ఆ సంబంధం.. కొడుకును ఏం చేశాడంటే?
, బుధవారం, 3 ఏప్రియల్ 2019 (15:37 IST)
వివాహేతర సంబంధాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తాజాగా కోడలితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్నకొడుకని కూడా చూడకుండా దారుణంగా హత్య చేసాడు ఓ కసాయి తండ్రి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. 
 
పంజాబ్ రాష్ట్రంలోని ఫరీదాకోట్ ఏరియాకు చెందిన 60 ఏళ్ల చోటా సింగ్ అనే వ్యక్తికి ముగ్గురు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు రాజ్వీందర్ సింగ్‌కు 12 ఏళ్ల క్రితం పెళ్లైంది. రాజ్వీందర్ సింగ్ భార్య జస్వీర్ కౌర్‌తో పాటు ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.

ఇదిలా ఉండగా అతడు తండ్రిని కొన్నాళ్లు తన దగ్గర ఉంచుకునేందుకు ఇంటికి తీసుకొచ్చాడు. అయితే కొడుకు ఆఫీసుకు వెళ్లిన సమయంలో కోడలు జస్వీర్‌కౌర్‌తో ఇంట్లో ఒంటరిగా ఉండే చోటా సింగ్ ఆమెను లొంగదీసుకున్నాడు.
 
రాజ్వీందర్ సింగ్‌కు తెలియకుండా ఇద్దరూ శారీరక సంబంధం కొనసాగిస్తూ వచ్చారు. కొన్నాళ్లకు మామా-కోడళ్ల మధ్య కొనసాగుతున్న ఆ సంబంధాన్ని రాజ్వీందర్ సింగ్ ఎలాగోలా కనిపెట్టాడు. తండ్రిని చిన్నకొడుకు దగ్గర విడిచిపెట్టాలని భావించాడు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న కొడుకును చంపేయాలని చోటా సింగ్ ఫిక్స్ అయ్యాడు. 
 
రాత్రి పడుకున్న తర్వాత రాజ్వీందర్ సింగ్‌పై కత్తితో దాడి చేసిన చోటా సింగ్ శవాన్ని ముక్కలు చేసి బ్యాగులో పెట్టి డ్రైనేజీలో పడేశాడు. చోటా సింగ్, జస్వీర్ కలిసి బాడీని తీసుకుని డ్రైనేజీలో పడేయడానికి వెళ్లిన సమయంలో వారి ఇంటికి మేనల్లుడు వచ్చాడు
 
గదిలో ఉన్న రక్తం చూసి, కంగారుపడి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోటాసింగ్‌ను తమదైన శైలిలో నిలదీయగా విషయం బయటికి వచ్చింది. మామకోడళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పసుపు కుంకుమ' దెబ్బకొట్టేలా ఉంది.. ఏం చేద్దాం : పార్టీ నేతలతో జగన్ మంతనాలు!!