Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ షేర్ చేస్తే చిక్కుల్లో ప‌డ్డ‌ట్టే!

వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్ షేర్ చేస్తే చిక్కుల్లో ప‌డ్డ‌ట్టే!
, గురువారం, 27 మే 2021 (11:22 IST)
కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌వ‌ద్ద‌ని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. దానిలో టీకా తీసుకున్న వ్య‌క్తి పేరు, ఇతర వ్యక్తిగత వివ‌రాలు ఉంటాయ‌ని పేర్కొంది. మోస‌గాళ్లు ఎవ‌రైనా ఈ సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవ‌కాశాలున్నాయ‌ని పేర్కొంది.

అందుకే ఈ విష‌యంలో జాగ్రత్తగా ఉండాల‌ని పేర్కొంది. కాగా సైబర్ దోస్త్‌ అనేది ప్ర‌భుత్వ అధికారిక ట్విట్టర్ ఖాతా. దీనిని సైబర్ సెక్యూరిటీపై ప్ర‌జ‌ల‌కు అవగాహన  క‌ల్పించేందుకుహోం వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్వ‌హిస్తోంది.
 
దేశంలో క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సినేషన్ డ్రైవ్ కొన‌సాగుతోంది. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్ల వ‌య‌సు దాటిన వారందరికీ టీకాలు వేస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో వ్యాక్సినేషన్ స్లాట్‌ బుక్ చేయడంలో ప‌లు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. కోవిడ్-19 వ్యాక్సిన్ వేసిన త‌రువాత సంబంధిత వ్య‌క్తికి ప్రభుత్వం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జారీ చేస్తుంది.

దీనిని కొంద‌మంది సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా హోం మంత్రిత్వ శాఖ త‌న సైబర్ దోస్త్‌ ఖాతా నుంచి ఒక హెచ్చ‌రిక చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లో భానుడి సెగ.. వడగాలులు తప్పవు.. 3 రోజులు బయటికి రావొద్దు