Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 31 March 2025
webdunia

మార్చి 3న ఉరితీస్తారని భావిస్తున్నా : నిర్భయ తల్లి

Advertiesment
Nirbhaya
, సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (17:34 IST)
నిర్భయ దోషులకు చాలా అవకాశాలిచ్చారని, ఈసారి శిక్ష అమలు చేయడం వాయిదా పడదని అనుకుంటున్నానని అన్నారు. ఖరారు చేసిన తేదీ నాడే ఆ నలుగురిని తప్పకుండా ఉరి తీస్తారని భావిస్తున్నానని, దోషులకు శిక్ష పడిన తర్వాతే దేశానికి తన సందేశం వినిపిస్తానని చెప్పారు.
 
మరోవైపు, నిర్భయ దోషులకు ఉరి శిక్ష అమలు తేదీ ఖరారైంది. నలుగురు దోషులకు కొత్త డెత్ వారెంట్‌ను పటియాలా హౌస్ కోర్టు జారీచేసింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా ఆదేశాలు జారీచేశారు. 
 
దీంతో మార్చి 3వ తేదీ ఉదయం ఆరు గంటలకు తీహార్ జైలులో నలుగురినీ ఒకేసారి ఉరి తీయనున్నారు. కాగా, ఇప్పటికే రెండు సార్లు డెత్ వారెంట్ జారీ అయినప్పటికీ ఉరి శిక్ష అమలు కాలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షహీన్‌బాగ్ నిరసనకారులతో సుప్రీంకోర్టు చర్చలు