Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షారుక్ నివాసం సమీపంలోని జివేష్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం.. ఏమైంది?

Bandra’s Bandstand
, మంగళవారం, 10 మే 2022 (15:32 IST)
Bandra’s Bandstand
ముంబై బాంద్రా ప్రాంతంలోని 'జివేష్ బిల్డింగ్'లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ నివాసం 'మన్నత్'కు అత్యంత సమీపంలో ఈ భవనం ఉంది. 
 
ఇక జివేష్ బిల్డింగ్ 21అంతస్తుల భవనంలో.. 14వ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. లెవల్-2 ఫైర్ యాక్సిడెంట్‌గా గుర్తించిన అధికారులు.. 8 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేశారు. 
 
ఈ ప్రమాదం నుంచి ఆరుగురు వ్యక్తుల్ని, ఓ పెంపుడు కుక్కను కాపాడారు పోలీసులు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేక ఇంట్లోనే అగ్నిప్రమాదం జరిగిందా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగితే మాత్రం సదరు భవనం నిర్మించిన బిల్డర్‌పై కఠిన చర్యలకు ముంబయి మహానగర పాలక సంస్థ సిద్ధమవుతోంది. 
 
ఈ ఘటనపై షారూక్ స్పందించాడు. 'ఇంట్లో మంటలు చెలరేగాయి. ఎలా జరిగిందో తెలియదు. అయితే ఇంట్లో అంతా సేఫేనని షారూఖ్ చెప్పాడు. అన్ని డిపార్టుమెంట్స్ వెంటనే స్పందించినందుకు థాంక్స్' అంటూ షారుక్ ఖాన్ శుక్రవారం తెల్లవారు ఝామున ట్విట్టర్లో ట్వీట్ చేశారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాచుపల్లి జంక్షన్‌లో ట్రాఫిక్‌‌కు ఇక కళ్లెం.. త్వరలోనే ఫ్లై-ఓవర్