Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెనక్కి తగ్గని రైతులు.. ఈ నెల 6న చక్కా జామ్

వెనక్కి తగ్గని రైతులు.. ఈ నెల 6న చక్కా జామ్
, మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (08:27 IST)
కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న ఏకైక డిమాండ్‌తో రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆదోళనలో భాగంగా, ఈ నెల 6వ తేదీన దేశ వ్యాప్తంగా రాస్తా రోకో (చక్కా జామ్) నిర్వహించాలని నిర్ణయించారు. 
 
ఆ రోజున జాతీయ, రాష్ట్ర రహదారులను మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటలపాటు దిగ్బంధించనున్నట్టు రైతుల సంఘాల నేతలు సోమవారం ప్రకటించారు. 
 
పార్లమెంటులో సోమవారం ప్రవేశపెట్టిన 2021-22 వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి భారీ మొత్తంలో నిధులు కేటాయింపు జరిగింది. ఈ కేటాయింపులతో తమకు సంబంధం లేదని, తాము కోరుకుంటున్నది సాగు చట్టాల రద్దేనని రైతు నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు.
 
ఇకపోతే, ఢిల్లీ సరిహద్దుల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో బడ్జెట్ విషయాల గురించి తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు. పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర గురించి ప్రభుత్వం మాట్లాడడం లేదని, తాము ప్రధానితో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 
 
వ్యవసాయ రుణ లక్ష్యాన్ని పెంచినంత మాత్రాన ప్రయోజనం లేదని, రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలు చేపట్టాలని గ్రామీణ్ కిసాన్ మజ్దూర్ సమితి నేత రంజీత్ రాజు పేర్కొన్నారు. తమ డిమాండ్లపై కేంద్రం దిగొచ్చేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రాణస్నేహితుడి భార్యను లొంగదీసుకున్నాడు, ఇద్దరూ కలిసి జంప్, ఫోన్లు స్విచాఫ్