Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొలి రోజు 10 గంటల విచారణ - రెండో రోజు 11 గంటలు... నేడు కూడా

rahul gandhi
, బుధవారం, 15 జూన్ 2022 (09:16 IST)
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూడో రోజు అయిన బుధవారం కూడా విచారణ జరుపనున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆయన సోమవారం నుంచి వరుసగా విచారణకు హాజరవుతున్నారు. 
 
రెండో రోజైన మంగళవారం ఏకంగా 11 గంటల పాటు విచారణ జరిగింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆయన మధ్యాహ్నం 3.30 గంటలకు ఒకసారి బ్రేక్ ఇచ్చారు. భోజనానికి ఇంటికి వెళ్లి తిరిగి సాయంత్రం 4.30 గంటలకు కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి రాత్రి 11.30 గంటల వరు ఏకబిగువున రాహుల్ వద్ద విచారణ జరిగింది. 
 
రెండు రోజుల పాటు సుధీర్ఘంగా సాగిన విచారణలో భాగంగా ఈడీ అధికారులు రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈడీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు రాహుల్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చినట్టు సమాచారం. అంటే ఈ లిఖిత పూర్వక సాక్ష్యాధారాలుగా ఈడీ అధికారులు పరిగణించే దిశగా ఈడీ అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. 
 
అంతేకాకుండా, మూడో రోజైన బుధవారం కూడా ఈడీ అధికారులు రాహుల్ గాంధీని విచారణకు రావాలని ఆదేశించారు. తొలి రోజు విచారణ ముగిసిన తర్వాత ఈ మేరకు వారు రాహుల్‌కు స్వయంగా సమన్లు అందజేశారు. ఫలితంగా ఆయన మంగళవారం కూడా ఈడీ కార్యాలయానికి రానున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు మమత సారథ్యంలో ఢిల్లీలో భేటీ - సీఎం కేసీఆర్ దూరం దూరం