Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోలియో చుక్కలకు బదులు శానిటైజర్ తాగించారు.. ఎక్కడో తెలుసా?

పోలియో చుక్కలకు బదులు శానిటైజర్ తాగించారు.. ఎక్కడో తెలుసా?
, మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:53 IST)
మహారాష్ట్రలోని యవత్మాల్‌లో ఆరోగ్య కార్యకర్తలు నిర్లక్ష్యంగా వ్యవహరిచారు. 12 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్‌కు బదులు శానిటైజర్ తాగించారు. దీంతో వారు అనారోగ్యం పాలవడంతో ఆసుపత్రికి తరలించారు.

ఈ ఉదంతం ఘాటాంజీ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే యవత్మాల్ పరిధిలోని ఒక గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు.

ఈ నేపధ్యంలో అక్కడి ఆరోగ్య కార్యకర్తలు 12 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్‌కు బదులు హ్యాండ్ శానిటైజర్ తాగించారు.

దీంతో వారు కొద్దిసేపటి తరువాత అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు సీబీఐ నోటీసులు