Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యజమానురాలిపై అత్యాచారయత్నం.. అలా కాపాడిన శునకం..

యజమానురాలిపై అత్యాచారయత్నం.. అలా కాపాడిన శునకం..
, మంగళవారం, 29 జనవరి 2019 (16:04 IST)
మనిషిని మనిషే రక్షించని ఈ కాలంలో ఒక శునకం తన యజమానురాలుని ఆపద నుండి రక్షించి కృతజ్ఞతను చాటుకుంది... ఓ పెంపుడు శునకం. తన యజమానురాలుని రక్షించడంలో తనకు కత్తిపోటు తగిలినా, రక్తస్రావం అవుతున్నా పట్టించుకోలేదు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్ సమీపంలో ఉన్న చోలాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. చోలాకు చెందిన ఓ కుటుంబం కుక్కను పెంచుకుంటోంది. ఆదివారం మధ్యాహ్నం ఇంటి యజమాని సొంత పనిమీద బయటకు వెళ్లాడు. ఇంట్లో భార్య మాత్రమే ఒంటరిగా ఉండటంతో, ఓ దుండగుడు తలుపు తట్టాడు. యధావిధిగా ఆమె తలుపు తీసింది, వెంటనే దుండగుడు ఆమె నోరు మూసివేసి లోపలకి ఈడ్చుకుని వెళ్లాడు. కత్తితో బెదిరించి అత్యాచారం చేయబోయాడు.
 
ఇంట్లో నుండి గట్టిగా కేకలు వినిపించడంతో, బయట ఉన్న శునకం అప్రమత్తమైంది. పరుగున వెళ్లి అతడిపై దాడి చేసింది, ఈ క్రమంలో శునకాన్ని అతను కత్తితో పొడిచాడు. ఈలోపు మహిళ అక్కడ నుండి తప్పించుకుంది. ఆ తర్వాత దుండగుడు కూడా అక్కడ నుండి పరారయ్యాడు.

ఈ ఘటన గురించి బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం శోధిస్తున్నారు. గాయపడిన కుక్కను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు కోలుకుంటోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుమారుడి కోసం.. తల్లీకూతుళ్లపై యాసిడ్ పోసిన తండ్రి.. ఎక్కడ?