Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెట్రో స్టేషన్‌లో కుప్పకూలిన ప్రయాణికుడు.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన జవాన్

Heart attack
, సోమవారం, 6 నవంబరు 2023 (08:53 IST)
ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అతన్ని గమనించిన ఓ జవాను హుటాహుటిన సీపీఆర్ చేసి ఆ ప్రయాణికుడి ప్రాణాలు రక్షించారు. ఈ  ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఢిల్లీలోని నంగ్లోయ్‌ మెట్రో స్టేషన్‌లో అనిల్‌ కుమార్‌(58) అనే ప్రయాణికుడు మెట్రో స్టేషన్‌లో చెకింగ్‌ పాయింట్‌ దాటిన తర్వాత అకస్మాత్తుగా ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో అక్కడే భద్రతా విధుల్లో ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఉత్తమ్‌కుమార్‌ సకాలంలో స్పందించి అతడికి కార్డియోపల్మనరీ రిససిటేషన్‌(సీపీఆర్‌) అందించడం ద్వారా ప్రాణాల్ని నిలబెట్టారు. 
 
ఈ ప్రక్రియ చేసిన వెంటనే ఆ ప్రయాణికుడు స్పృహలోకి రాగా.. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాత సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సీఐఎస్‌ఎఫ్‌ తన 'ఎక్స్‌' ఖాతాలో షేర్‌ చేయడంతో ఇది వైరల్ అయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపావళి పండుగ కోసం భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు