Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీలో డేంజర్ బెల్స్... బాణసంచా కాల్చడం వల్లే...

ఢిల్లీలో డేంజర్ బెల్స్... బాణసంచా కాల్చడం వల్లే...
, సోమవారం, 22 నవంబరు 2021 (15:45 IST)
ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఫరీదాబాద్‌లో 454గా, గ్రేటర్ నోయిడాలో 410గా, ఘజియాబాద్‌లో 438గా, గుర్గావ్‌లో 473గా నమోదైంది.
 
గాలి నాణ్యత ఇంత ప్రమాదకర స్థాయికి పడిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)జీరో నుంచి 50 వరకు ఉంటే.. అక్కడ గాలి నాణ్యత బాగున్నట్లు పరిగణిస్తారు. 51-100 మధ్యలో ఉంటే సంతృప్తికరంగా ఉందని,101-200 వరకు ఉంటే ఓ మోస్తరుగా ఉన్నట్లు పరిగణిస్తారు.
 
దీపావళి రోజు బాణసంచా కాల్చడంపై ప్రభుత్వ నిషేధం విధించినా ప్రజలు ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. శుక్రవారం (నవంబర్ 5) తెల్లవారుజామున దట్టమైన పొగ నగరాన్ని ఆవరించింది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ, వెదర్ ఫోర్‌క్యాస్టింగ్ అండ్ రీసెర్చ్ ప్రకారం ఉదయం 8గంటల సమయంలో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 451గా నమోదైంది.
 
ప్రజలు బాణసంచా కాల్చడం, బయో మాస్ కాలుష్య కారకాలే ఇందుకు కారణమన్నారు. అయితే వాయు వేగం పెరిగితే ఇప్పుడున్న పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంటుందన్నారు భారత వాతావరణ శాఖ(IMD)అధికారి ఆర్కే జనమణి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసెంబ్లీలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం... ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు