Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Love Story: మహిళకు షాకిచ్చిన యువకుడు.. చివరికి జైలులో చిప్పకూడు

Advertiesment
lovers

సెల్వి

, శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (10:35 IST)
తమిళనాడు, కోయంబత్తూరులోని కునియముత్తూరుకు చెందిన 33 ఏళ్ల మహిళ వివాహం చేసుకుంది. ఆమె దిండిగల్ జిల్లా సెంగురిచికి చెందిన పొన్నుసామి అనే యువకుడిని ప్రేమించిందని, అతను కునియముత్తూరులో నివసించేవాడని చెబుతారు. వారిద్దరూ వివాహేతర సంబంధం కొనసాగించారు. అయితే కొద్ది నెలల తర్వాత ఆమె ప్రియుడిని దూరం పెట్టింది. దీంతో కోపంగా ఉన్న ఆ యువకుడు ఆ అమ్మాయికి తేరుకోలేని షాక్‌ ఇచ్చాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులోని కునియముత్తూరుకు చెందిన 33 ఏళ్ల వ్యక్తి ఒక యువతిని వివాహం చేసుకున్నాడు. ఆ యువతికి దిండిగల్ జిల్లా సెంగురిచికి చెందిన పొన్నుసామి (27)తో సంబంధం ఉంది. అతను కునియాముత్తూరులో నివసిస్తున్నాడు. వీరి పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. వారిద్దరూ తరచుగా కలుసుకుంటూ ఉండేవారు. ఈ సమాచారం ఆ మహిళ కుటుంబానికి తెలియరావడంతో ఆ మహిళ ప్రియుడిని దూరంగా పెట్టింది. 
 
కానీ పొన్నుసామి ఆమెను వదులుకోలేదు. ఆ మహిళ తనతోనే ఉండాలని పట్టుబట్టాడు. ఆమె నిరాకరించడంతో, ఆ మహిళ ప్రైవేట్ ఫోటోలను ఆమె బంధువుల సెల్ ఫోన్లకు పంపుతానని బెదిరించాడు. ఆ మహిళ దీనిని ఖండించింది. దీంతో ఆగ్రహించిన పొన్నుసామి ఆ మహిళ ఇంటికి వెళ్లి, ఆమెను అనుచిత పదాలతో దూషించి, వాగ్వాదానికి దిగాడు. అక్కడే ఉన్న ఆ మహిళ తల్లి పొన్నుసామిని బయటకు వెళ్ళమని అడిగింది. ఆ తర్వాత పొన్నుసామి ఆ మహిళ తల్లిపై దాడి చేశాడని చెబుతున్నారు. ఆ మహిళ కునియముత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి పొన్నుసామిని అరెస్టు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్రమ సంబంధం బయటపడుతుందని ప్రియుడితో జతకట్టి భర్తను మట్టుబెట్టిన భార్య!!