Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇకపై ఒకే దేశం.. ఒకే మార్కెట్ : మోడీ సర్కారు మరో కీలక నిర్ణయం

ఇకపై ఒకే దేశం.. ఒకే మార్కెట్ : మోడీ సర్కారు మరో కీలక నిర్ణయం
, బుధవారం, 3 జూన్ 2020 (18:50 IST)
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశానికి అన్నంపెట్టే రైతన్నలను ఆదుకునేందుకు వీలుగా ఒకే దేశం - ఒకే మార్కెట్ ఏర్పాటు దిశగా ముందుకు అడుగువేసింది. అంటే, రైతులు ఇకపై తమ పంటలను దేశంలో ఎక్కడైనా అంటే ఎక్కడ ధర ఉంటే అక్కడ ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునేలా అనుమతినించింది. ఈ మేరకు ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే అక్కడ అమ్ముకునే స్వేచ్ఛ రైతులకు లభించింది. రైతులకు మేలు చేసేందుకు నిత్యావసరాల చట్టాన్ని సవరించాలని కూడా నిర్ణయించింది. నిత్యావసరాల చట్టాన్ని సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల వ్యవసాయ రంగంలో సానుకూల మార్పులు చోటుచేసుకుని రైతుల ఆదాయం పెరిగేందుకు బాటలు పడతాయి. ధాన్యాలు, పప్పులు, ఆయిల్, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలను నిత్యావసరాల చట్టం నుంచి తొలగించారు. ఈ విషయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ మీడియాకు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్‌బుక్‌తో చేతులు కలిపిన సారెగామా, ఇకపై వీటిని మీరు ఉపయోగించుకోవచ్చు