Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేనకోడలిపై మనసు పారేసుకున్న అత్త.. భర్తను వదిలేసి డుం డుం డుం

Advertiesment
women marriage

సెల్వి

, మంగళవారం, 13 ఆగస్టు 2024 (11:25 IST)
women marriage
బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో ఇద్దరు మహిళల వివాహానికి సంబంధించిన వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. మేనకోడలిపై మనసు పారేసుకున్న అత్త భర్తను వదిలేసింది. అంతే మేనకోడలిని వివాహం చేసుకుంది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం గత మూడేళ్లుగా నడుస్తోంది. 
 
మేనకోడలికి వేరే చోట పెళ్లి జరుగుతుందని తెలుసుకున్న అత్త పెళ్లి నిర్ణయం తీసుకుంది. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
బెల్వా నివాసి అత్త సుమన్, మేనకోడలు శోభ ఇద్దరూ కుచయ్‌కోట్ పోలీస్ స్టేషన్‌లోని ససముసాలోని దుర్గా భవాని ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈ వింత వివాహం చర్చనీయాంశంగా మారింది. 
 
ఆలయంలో వివాహ వేడుకల్లో అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఇద్దరూ దండలు మార్చుకున్నారు. మెడలో మంగళసూత్రం కట్టుకున్నారు. ఆపై సింధూర్ ధరించి, అగ్ని సాక్షిగా ఏడడుగులు వేశారు. ఎప్పటికీ ఒకరికొకరు అండగా వుంటారని వాగ్ధానం చేసుకున్నారు. 
 
"పెళ్లయ్యాక మేమిద్దరం కలిసి జీవిస్తాం, చనిపోతామని ప్రమాణం చేశాం." అంటూ చెప్పారు.  సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేయడం ద్వారా తమ పెళ్లి గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆ వీడియోలో ఇద్దరూ తమ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామని, కలకాలం కలిసి ఉంటామని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అగ్రిగోల్డ్ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు అరెస్టు!!