Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీహార్‌లో భీకర పేలుడు - కుప్పకూలిన భవనాలు.. ప్రాణనష్టం

బీహార్‌లో భీకర పేలుడు - కుప్పకూలిన భవనాలు.. ప్రాణనష్టం
, శుక్రవారం, 4 మార్చి 2022 (14:56 IST)
బీహార్ రాష్ట్రంలో భీకర పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ పేలుడు రాష్ట్రంలోని భాగల్‌పూర్ జిల్లాలో జరిగింది. 
 
గురువారం రాత్రి సమయంలో అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా ఏడుగురు మరణించగా, పలువురుకి గాయాలయ్యాయి. ఈ పేలుడు శబ్దాలు 4 కిలోమీటర్ల పరిధి వరకు వినిపించాయి. కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రాంతమంతా కంపించింది. అంటే ఈ పేలుడు ఏ స్థాయిలో జరిగిందో ఇట్టే ఊహించుకోవచ్చు. 
 
తాతర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కజ్‌బాలి చక్‌‍లో ఈ ఘటన జరిగింది. కాగా, ఈ పేలుడులో మృతి చెందినవారంతా ఎన్నోయేళ్లుగా బాణాసంచా తయారు చేస్తున్నారు. వీరు తయారు చేసిన బాణాసంచాను ఇంటిలో నిల్వచేసి వుంటారని, ప్రమాదవశాత్తు ఈ పేలుడు సంభవించివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలు రాజకీయంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ కోరిక : మంత్రి సబిత