Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందమైన భార్య, ఉదయం నుంచి ఫోన్లో చాటింగ్, అనుమానంతో భర్త

అందమైన భార్య, ఉదయం నుంచి ఫోన్లో చాటింగ్, అనుమానంతో భర్త
, శుక్రవారం, 26 మార్చి 2021 (17:28 IST)
మూడుముళ్ల బంధానికి అనుమానం ముల్లు గుచ్చుకుంది. క్షణికావేశం పిల్లలకు తల్లిని దూరం చేసింది. భర్త చేతిలో భార్య హత్యకు గురైంది. ఆ ఇంటి దీపం ఆరిపోయింది. భవిష్యత్తు చీకటిగా మారింది. భార్యపై అనుమానంతో హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లా జీసస్‌నగర్‌లో జరిగింది. కర్నూలు జిల్లా చిప్పగిరి సమీపంలోని నంచెర్ల గ్రామానికి చెందిన కవితను, అదే ప్రాంతానికి చెందిన సంతోష్ 13 ఏళ్ల కిందట వివాహం చేసుకున్నాడు.
 
అనంతపురంలో ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ.. జీసస్‌నగర్‌లో స్థిరపడ్డాడు. సంసారం సాఫీగా సాగుతుంది. ఇంతలోనే కవితకు నంచెర్లలో పరిచయం ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడు ఇటీవల తరచూ ఫోన్‌ చేసి మాట్లాడుతున్నాడు. గత ఏడాదిలో కరోనా వ్యాప్తి చెందటంతో కవిత ఇద్దరి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. 
 
ఆరు నెలల తర్వాత భర్త వెళ్లి అనంతపురానికి తీసుకొచ్చాడు. తరచూ ఫోనులో మాట్లాడటంపై పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిపారు. కానీ భార్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. నిన్న రాత్రి భార్యాభర్తలు గొడవ పడ్డారు. భార్య ఫోన్లో మెసేజ్‌లు, చాటింగ్‌లు చూసి మరింత కోపంతో ఊగిపోయాడు సంతోష్. లుంగీని గొంతుకు బిగించి చంపేసి అనంతరం పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : డీఎంకే గెలుపు నల్లేరుపై నడకే...