Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూపీలో ఘోరం 20 రోజుల్లో 3 ఘటనలు.. మూడేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

యూపీలో ఘోరం 20 రోజుల్లో 3 ఘటనలు.. మూడేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం
, శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (10:41 IST)
ఉత్తరప్రదేశ్‌లో నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా మూడేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా కామాంధులు ఆ చిన్నారిని హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 20 రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి.
 
ఇక బాధితురాలి మృతదేహాన్ని సింఘాయ్ ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం రిపోర్ట్ కోసం తరలించారు. ఆమె తలకు తీవ్రగాయాలైనట్లు ఇప్పటికే వైద్యులు తెలిపారు. పాతకక్షల కారణంగా గ్రామానికి చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు చెప్తున్నారు. 
 
ఇదే విధంగా లఖింపూర్ ఖేరి జిల్లాలో ఇటీవల తన గ్రామానికి వెలుపల 17 ఏళ్ల బాలిక చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. స్కాలర్‌షిప్ దరఖాస్తును పూరించడానికి ఇంటి నుంచి వెళ్లిన తర్వాత ఆమెపై అత్యాచారం, హత్య జరిగింది. ఆమె గ్రామం నుండి 200 మీటర్ల దూరంలో ఆమె మృత దేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటన కంటే ముందు ఇదే జిల్లాలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి గొంతు కోసి చంపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అడ్డగించి... యాసిడ్ పోస్తామని బెదిరించి మైనర్‌ను కాటేసిన కుర్రోళ్ళు.. ఎక్కడ?