Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హన్మకొండలో మహిళ దారుణ హత్య, పోలీసు స్టేషన్ దగ్గరలోనే జరిగిన దుర్ఘటన

హన్మకొండలో మహిళ దారుణ హత్య, పోలీసు స్టేషన్ దగ్గరలోనే జరిగిన దుర్ఘటన
, గురువారం, 3 సెప్టెంబరు 2020 (12:48 IST)
హన్మకొండలో దారుణ హత్య జరిగింది. పోలీసు స్టేషను కూతవేటు దూరంలోనే ఈ  సంఘటన జరగడం అందర్ని ఆందోళనకు గురిచేస్తోంది. హన్మకొండ టైలర్ స్ట్రీట్‌లో దోరం శారద అనే మహిళ కూరగాయలు విక్రయించుకుంటూ కుమారుడితో కలిసి జీవనం గడుపుతోంది. కొంత కాలం క్రితం భర్తతో గొడవపడి విడిగా ఉంటున్న శారదను గుర్తు తెలియని అగంతకులు హతమార్చారు.
 
ఆమెతో పాటు ఆమె కుమారుడిని కూడా తీవ్రంగా గాయపరిచారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో వారిపై విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చారు. శారద తలకు బలమైన గాయాలు కావడంతో శారద అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె కుమారుడు అఖిలేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
 
పోలీసు స్టేషనుకు అతి దగ్గర దూరంలో ఈ ఘటన జరగడంతో హన్మకొండలో విషయం చర్చాంశనీయంగా మారింది. వారిపై దాడికి తెగబడిన వారి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే శారద కుమారుడు తీవ్ర గాయాల పాలై ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో పోలీసులు అతడిని ఎంజీంఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికక్కడ చికిత్స జరుగుతోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యూడ్ బీచ్‌‌లో గ్రూప్ సెక్స్ పార్టీలు, ఫ్రాన్స్‌లో కరోనా వ్యాప్తికి కొత్త కేంద్రాలు