Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్ణాటకలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ

కర్ణాటకలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ
, గురువారం, 17 అక్టోబరు 2019 (06:09 IST)
కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు కేసీ రామమూర్తి బుధవారంనాడు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

రాజీనామా పత్రాన్ని రాజ్యసభ సభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు అందజేయగా ఆయన దానిని ఆమోదించారు. రామమూర్తి త్వరలోనే బీజేపీలో చేరనున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఇటీవల కాలంలో, కాంగ్రెస్‌కు చెందిన భువనేశ్వర్ కలిత, సంజయ్ సింగ్‌ సైతం రాజ్యసభకు రాజీనామా చేశారు.

అలాగే బీజేపీలో చేరేందుకు వీలుగా నీరజ్ శేఖర్, సురేంద్ర సింగ్ నెగర్, సంజయ్ సేథ్‌లు ఇటీవల సమాజ్‌వాదీ పార్టీని, ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వాన్ని వీడారు. ఆ తర్వాత బీజేపీ టిక్కెట్‌పై వీరంతా పోటీ చేసి తిరిగి ఎన్నికయ్యారు.

దీంతో రాజ్యసభలో బీజేపీ బలం పెరిగింది. గత జూన్‌లో నలుగురు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎంపీలు సైతం బీజేపీలో చేరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేనేతలకు రూ. 24 వేలు, మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేలు.. మంత్రి మండలి