Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రధాని నరేంద్ర మోడీ వారసుడు ఆయనే...

amit shah
, శుక్రవారం, 25 ఆగస్టు 2023 (14:11 IST)
ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీలో తిరుగులేని నేతగా ఉన్నారు. ఇపుడు మరో చర్చ తెరపైకి వచ్చింది. ప్రధాని మోడీ తర్వాత బీజేపీలో తదుపరి నేత ఎవరు అన్నది ఇపుడు చాలా మందిలో ఉత్పన్నమైన ప్రశ్న. మోడీ తర్వాత బీజేపీలో ఆ బాధ్యతలను అందుకునేది ఎవరు, మోడీ రాజకీయ వారసుడు ఎవరు అనే విషయాలపై ఇప్పటికే చర్చ జరుగుతుంది. 
 
ఈ అంశానికి సంబంధించి ఇండియా టుడే - సీఓటర్ సంస్థలు తాజాగా ఓ సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో ప్రధాని మోడీ తర్వాత అత్యధిక ప్రజాదారణ కలిగిన నేతగా కేంద్ర హోం అమిత్ షా నిలిచారు. మోడీ తర్వాత ప్రధాని పదవిలో ఎవరిని చూడాలనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు 29 మంది ఓటర్లు అమిత్ షా పేరును చెప్పారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరును 26 శాతం మంది, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 15 శాతం మంది చొప్పున మొగ్గు చూపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెప్టెంబరులో చేపట్టే ఆదిత్య ఎనల్-1 ప్రత్యేకతలేంటి?