Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేంద్రం హోం మంత్రి అమిత్ షాతో జనసేనాని భేటీ.. ట్వీట్ వైరల్

pawan - amit shah
, బుధవారం, 19 జులై 2023 (22:08 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం రాత్రి సమావేశమయ్యారు. ఆ సమయంలో ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఈ సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. "గౌరవనీయులైన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో అద్భుతమైన సమావేశం జరిగింది. ఈ భేటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్నమైన భవిష్యత్‌కు దారితీస్తుందని తాను ఖచ్చితంగా భావిస్తున్నాను" అంటూ పేర్కొన్నారు.
webdunia
 
కాగా, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఎన్డీయే పార్టీల సమావేశంలో పాల్గొన్నారు. ఆ రాత్రికి అక్కడే ఉన్న ఆయన.. బుధవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రితో సమావేశమై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత నయాగరా వద్ద.. పేరెంట్స్ తిట్టారని పాప జంప్!