Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వృద్ధ దంపతులను డబ్బు కోసం చంపేశారు.. ఎక్కడ?

వృద్ధ దంపతులను డబ్బు కోసం చంపేశారు.. ఎక్కడ?
, మంగళవారం, 29 జనవరి 2019 (14:34 IST)
తల్లీ కొడుకులు కలిసి డబ్బు కోసం వృద్ధ దంపతులను కిరాతకంగా హతమార్చిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే దక్షిణ ఢిల్లీలోని అమర్ కాలనీలో వీరేందర్ కూమార్ ఖనేజా (77), సరళ (72) అనే వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. 
 
వారి ఇంట్లో పనిచేస్తున్న మహిళ, ఆమె కుమారుడు ఇద్దరూ కలిసి వారిని దారుణంగా చంపి 9 లక్షల నగదును, బంగారు ఆభరణాలను చోరీ చేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈనెల 26వ తేదీన ఆ వృద్ధ దంపతులు కనిపించడం లేదని ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వారి ఫ్లాట్‌ను బలవంతంగా తెరిచి చూసారు, అక్కడ ఇద్దరూ శవాలుగా కనిపించారు.
 
దుండగులు ఫ్లాట్ లోపలి వైపు తాళం వేసి దంపతుల ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేసారు. బాధితుల కుమారుడు డాక్టర్‌ అమిత్‌ ఖనేజా అమెరికాలో నివసిస్తున్నాడు. దర్యాప్తులో భాగంగా పోలీసులు వారి ఇంట్లో పనిచేసే మహిళను తమదైన రీతిలో విచారణ చేయగా అసలు విషయం బయటపెట్టింది. డబ్బు కోసమే ఈ పనికి పాల్పడినట్లు ఒప్పుకుంది.
 
జనవరి 18న వీరేందర్‌ ఖనేజా లాకర్‌లో డబ్బును ఉంచడం గమనించిన నిందితురాలు అదే రోజు మధ్యాహ్నం వీరేందర్ బయటకు వెళ్లగానే తమ కుమారుడితో కలిసి ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు సమాచారం అందించారు. వారి నుండి 9 లక్షల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్తగా పెళ్లైన కానిస్టేబుల్ లీవ్ లెటర్... మంచి మూడ్‌లో ఉన్నానంటూ..