హర్యానా రాష్ట్రంలో 19 ఏళ్ల హిందూ అమ్మాయి కోసం 21 ఏళ్ల ముస్లిం యువకుడు హిందువుగా మతం మారడం సంచలనమైంది. అయితే ఈ జంట యువతి కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని, వ్యక్తిగత స్వేచ్ఛకు హాని ఉందని హర్యానా హైకోర్టును ఆశ్రయించింది.
అలాగే తమ వివాహాన్ని వ్యతిరేకించడడంపై.. రాజ్యాంగంలోని ఆర్టికల్-21కింద తమకు కల్పించబడిన హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమేనని హైకోర్టుకు పేర్కొంది. కాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ జంటకి హర్యానా పోలీసులు రక్షణ కల్పించారు.
వివాహం తర్వాత... ప్రస్తుతం ఈ జంటని పోలీస్ ప్రొటెక్షన్లో ఉంచారు పోలీసులు. యువతి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు కలిశారు. చట్టబద్ధంగా జరిగిన వారి వివాహాన్ని అంగీకరించాల్సిందిగా కుటుంబసభ్యులను పోలీసులు ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే యువతి కుటుంబ సభ్యులు మాత్రం వారిని కలిసేందుకు నిరాకరించారు.
ఇప్పటికే దేశంలో 'లవ్ జిహాద్'ను వ్యతిరేకిస్తూ యూపీ సర్కార్, బిజెపీ పాలిత రాష్ట్రాలు చట్టాలు చేస్తున్నాయి. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ఉన్న వీరి పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఎలా ముందుకెళుతారన్నది ఆసక్తిగా మారింది.