Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లయిన స్త్రీతో ప్రేమ... రాలేదని ఛాతీపై బ్లేడుతో కోసుకున్నాడు... ఆపై...

Advertiesment
man
, సోమవారం, 3 డిశెంబరు 2018 (10:13 IST)
ఈమధ్య పరస్పరం ఇష్టముండి సంబంధం కొనసాగించడం... అదే వివాహేతర సంబంధం అనేది నేరం కాకపోవడంతో పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమల్లో మునిగితేలేవారు ఎక్కువవుతున్నారు. ఇలాంటి ప్రేమల్లోనూ పలు దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీలో ఇలాంటి ఘటనే జరిగింది. తను ప్రేమించిన పెళ్లయిన ప్రియురాలు తను పిలువగానే రాలేదన్న కోపంతో ఓ వ్యక్తి బ్లేడుతో కోసుకుని బీభత్సం సృష్టించాడు. అంతటితో ఆగకుండా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే... ఢిల్లీలో సంగం విహారులోని కేబుల్ ఆఫీసులో లక్ష్మీనారాయణ పనిచేస్తున్నాడు. ఇతడికి పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలు కూడా వున్నారు. ఐతే ఆమెకు కొంతకాలంగా దూరంగా వుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడే మరో వివాహితతో సన్నిహితంగా వుంటున్నాడు. ఇది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఆదివారం నాడు శెలవు దినం కావడంతో ఆమెను తన గదికి రావాలని ఫోన్ చేశాడు. 
 
ఆమె ఎంతకీ రాకపోవడంతో బ్లేడుతో తన గుండెపై కోసుకుని బీభత్సమైన ఫోటోలను ఆమెకు పంపాడు అలాగైనా వస్తుందని. కానీ ఆమె రాకపోవడంతో అప్పటికే పూటుగా మద్యం సేవించిన నారయణ ఆఫీసులో వుండే కేబుల్ వైర్లను తీసుకుని వాటితో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందటంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిటైర్మెంట్ వయుసు 61 యేళ్లు... వృద్ధాప్య పెన్షన్ అర్హత వయసు 57.. తెరాస మేనిఫెస్టో