Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రాణాలు తీసిన హల్వా... ఏం జరిగింది?

రాజస్థాన్‌లో‌ ఘోరం జరిగింది. బంధువుల ఇంటికెళ్లి హల్వా తిని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది. వివరాల్లోకి వెళితే.. భిల్వారా జిల్లాలోని భుటేలా గ్రామంలో ఓ ఇంటికి అతిథులు

ప్రాణాలు తీసిన హల్వా... ఏం జరిగింది?
, శనివారం, 10 ఫిబ్రవరి 2018 (18:39 IST)
రాజస్థాన్‌లో‌ ఘోరం జరిగింది. బంధువుల ఇంటికెళ్లి హల్వా తిని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది. వివరాల్లోకి వెళితే.. భిల్వారా జిల్లాలోని భుటేలా గ్రామంలో ఓ ఇంటికి అతిథులు వచ్చారని.. వారి కోసం ఆ కుటుంబీకులు హల్వా చేసి వడ్డించారు. అయితే హల్వా తిన్నవారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. 
 
ఫుడ్ పాయిజన్ కారణంగా వారు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్తున్నా.. వారిపై విష ప్రయోగం చేశారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోనూ ఇదే తరహా ఘటన ఈ  ఏడాది జనవరిలో చోటుచేసుకుంది. 
 
బంధువుల ఇంటికి విందు కోసం వెళ్లిన కొందరు భోజనం చేస్తూనే ఒకరి తర్వాత ఒకరు వరుసగా తొమ్మిది మంది మృతి చెందారు. వీరు కలుషిత ఆహారం వల్ల మృతి చెందారని స్థానికులు అంటున్నా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బే... పవన్ కళ్యాణ్ దానికి సరిపోడు... ముద్రగడ సంచలన వ్యాఖ్యలు(Video)