Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉద్యోగంతో పాటు మరో సంపాదన వుండాలి.. భారతీయ కార్మికులు

money

సెల్వి

, మంగళవారం, 18 జూన్ 2024 (21:51 IST)
భారతీయులు ఆదాయ ఆర్జనలో అధిక ఆసక్తిని కలిగివున్నారని తాజా అధ్యయనంలో తేలింది. 41 శాతం మంది భారతీయ కార్మికులు ఇప్పుడు రెండు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయ వనరులను కలిగి ఉన్నారు. తాజా సర్వేలో 18 దేశాలలో అత్యధికంగా ఆదాయ వనరులు ఉన్నాయి.
 
ఎందుకంటే భారతీయ నిపుణులలో జీతం సంతృప్తి గణనీయంగా పెరిగింది. పీపుల్ ఎట్ వర్క్ 2024: ఎ గ్లోబల్ వర్క్‌ ఫోర్స్ వ్యూ పేరుతో జరిగిన వార్షిక సర్వే ప్రకారం, జీతం సంతృప్తి 2023లో 49 శాతం నుండి 73 శాతానికి పెరిగింది. ఇది 18 దేశాలలో మళ్లీ అత్యధికమని తేలింది. 
 
భారతీయ కార్మికులకు జీతం అత్యంత ముఖ్యమైన అంశంగా కొనసాగుతోందని సర్వేలో వెల్లడి అయ్యింది. 18 దేశాలలో భారతీయ ప్రతివాదుల ఉద్యోగ సంతృప్తి రేటు అత్యధికంగా 81 శాతంగా నమోదైంది. అంతేగాకుండా పురుషుల కంటే స్త్రీలు 84 శాతం జీతంతో ముందున్నారు. పురుషులు 78 శాతానికి పరిమితం అయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్ చిరంజీవి ఎన్డీఏ నుండి రాజ్యసభకు వెళ్తారా?