Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో 38 వేల కరోనా కొత్త కేసులు

Advertiesment
దేశంలో 38 వేల కరోనా కొత్త  కేసులు
, శనివారం, 7 ఆగస్టు 2021 (10:58 IST)
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొంతకాలంగా కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ముందురోజు 40 వేలకుపైగా నమోదైన కేసులు.. తాజాగా 13 శాతం తగ్గాయి. నిన్న 38,628 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరోసారి మరణాల సంఖ్య పెరిగింది. నిన్న 617 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దాంతో మొత్తం కేసులు 3.18 కోట్లకు చేరగా.. 4.27లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 17లక్షలకు పైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ప్రస్తుతం 4,12,153 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.29 శాతంగా ఉండగా.. రికవరీరేటు 97.37 శాతానికి చేరింది. తాజాగా 40వేల మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు మూడు కోట్ల 10లక్షలకు చేరాయి.
 
50 కోట్ల డోసులు పంపిణీ..
కరోనాపై పోరాటంలో భాగంగా జనవరి 16న దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం ప్రారంభమైంది. దానికింద ఇప్పటివరకు 50 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 49.5లక్షల మంది టీకా వేయించుకున్నట్లు కేంద్రం తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి ముత్తంశెట్టి