Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రాక్టికల్ పరీక్షలని రప్పించి మత్తుమందు కలిపి 17 మంది బాలికలపై అత్యాచారం

ప్రాక్టికల్ పరీక్షలని రప్పించి మత్తుమందు కలిపి 17 మంది బాలికలపై అత్యాచారం
, మంగళవారం, 7 డిశెంబరు 2021 (18:04 IST)
ప్రాక్టికల్స్ పేరిట ప్రిన్సిపల్ 17 మంది బాలికలపై వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముజఫర్‌నగర్ జిల్లాలోని పదో తరగతి చదువుతున్న 17మంది బాలికలపై ప్రిన్సిపల్‌తో పాటు అతని సహచరుడు వేధింపులకు పాల్పడ్డారు. వీరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 
 
ప్రాక్టికల్స్ పేరిట బాలికలను స్కూలుకు రప్పించే ప్రిన్సిపల్ యోగేష్ కుమార్.. ఆహారంలో మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయాక.. అకృత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని  ఎవరికైనా చెబితేనే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని.. బెదిరింపులకు పాల్పడేవాడని బాలికలు తెలిపారు. 
 
వాస్తవానికి ఈ ఘటన నవంబర్ 18న చోటుచేసుకోగా.. ఫిర్యాదు స్వీకరణ విషయంలో పోలీసులు నిర్లక్ష్యం కారణంగా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే ప్రమోద్ జోక్యం చేసుకోవడంతో పోలీసులు ఫిర్యాదును స్వీకరించారని బాలికల తల్లిదండ్రులు చెప్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్ చాటింగ్ : అందుబాటులోకి కొత్త ఫీచర్‌