Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ మూడు జిల్లాల్లోని పాఠశాలలకు 2 రోజుల సెలవు

ఆ మూడు జిల్లాల్లోని పాఠశాలలకు 2 రోజుల సెలవు
, శుక్రవారం, 3 డిశెంబరు 2021 (10:49 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారనుంది. ప్రస్తుతం ఇది విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 900 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది శనివారానికి ఆంధ్ర - ఒడిషా రాష్ట్రాల మధ్య తీరం దాటొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ కారణంగా ఏపీలోని విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ తుఫానుకు జవాద్ అనే పేరు పెట్టారు. ఇది పెను విపత్తను సృష్టించవచ్చని హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమైంది. ఆ మూడు జిల్లాల్లో స్కూల్స్‌కు శుక్రవారం, శనివారాల్లో సెలవులు ప్రటించారు. 
 
ఇదిలావుంటే, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారిందని, ఇది విశాఖపట్టణంకు ఆగ్నేయంగా 960 కిలోమీటర్ల దూరంలో ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వాయుగుండం వాయువ్య దిశగా పయనించి వచ్చే 24 గంటల్లో తుఫానుగా మారుతుందని ఐఎండీ వెల్లడించింది. 
 
అయితే, వాయుగుండం తుఫానుగా మారితే దీనికి జవాద్ అనే పేరును ఖరారు చేయనున్నారు. అదేసమయంలో ఈ తుఫాను ఈ నెల 4వ తేదీ శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్కా మధ్య తీరం దాటొచ్చని అంచని ఓ ప్రైవేటు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. 
 
ఈ కారణంగా ఉత్తర కోస్తా, ఒరిస్సా తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా, ఏపీలోని విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమై ఆ మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారును కూడా నియమించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కొత్తగా 9216 పాజిటివ్ కేసులు - 391 మంది మృతి