Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

13 పెళ్లిళ్లు, శోభనం గది నుంచి పారిపోయి 14వ పెళ్ళి చేసుకుంటూ వుండగా?

13 పెళ్లిళ్లు, శోభనం గది నుంచి పారిపోయి 14వ పెళ్ళి చేసుకుంటూ వుండగా?
, బుధవారం, 2 జూన్ 2021 (17:18 IST)
పెళ్ళి అంటే జీవితంలో ఒకేసారి వచ్చే అద్భుత ఘట్టం. కాబోయే భర్తతో జీవితాన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంటారు అమ్మాయిలు. కానీ కొంతమంది డబ్బు కోసం వివాహ బంధాన్ని వాడుకుంటూ ఉన్నారు. సరిగ్గా 21 యేళ్ళు కూడా లేని యువతి ఏకంగా 13 మందిని వివాహం చేసుకుంది. మరొకరిని పెళ్ళాడేందుకు సిద్థమైంది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
 
ఆమె ఓ నిత్యపెళ్ళి కూతురు. 21 యేళ్ళకే 13 మంది యువకులను మోసం చేసింది. ఆ సంఖ్యను మరింత పెంచేందుకు సిద్థమైంది. కానీ సీన్ రివర్స్ అయ్యి అరెస్టయ్యింది. పెళ్ళి పేరుతో మోసం చేస్తున్న సోను అనే యువతిపై ఆమెను పెళ్లిచేసుకున్నవారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
 
హింగోలి జిల్లా సాదా అనే ప్రాంతానికి చెందిన సోను అనే యువతికి భూషణ్ అనే యువకుడితో మే 6వ తేదీన వివాహం జరిగింది. కొన్నిరోజుల పాటు అతనితో సంతోషంగా ఉంది. అయితే మే 19వ తేదీన ఇంటి నుంచి పారిపోయింది. భర్త, అతని తరపు బంధువులు ఆమెను వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో సోను సోదరుడికి వారు ఫోన్ చేయగా తన వద్ద లేదని తెలిపాడు.
 
ఆ తర్వాత అతడు ఫోన్‌ను స్విచ్చాఫ్ చేశాడు. దీంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు భూషణ్. మరోవైపు సోను మరో యువకుడితో పెళ్ళికి సిద్ధమైంది. అయితే పెళ్ళిపీటల దగ్గరకు పోలీసులు వస్తున్నారని తెలుసుకుని పరారైంది. అక్కడి నుంచి పారిపోయి దులేబాద్ అనే ప్రాంతానికి చేరుకుంది. అయితే నిత్యపెళ్ళికూతురు దులేబాద్ ప్రాంతంలో ఉన్నారని సమాచారం రావడంతో పోలీసులు చాకచక్యంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చరిత్రలో కలుస్తున్న 135 ఏండ్ల సెంట్రల్ జైలు