Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిన్ అందక 11 మంది మృతి

చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిన్ అందక 11 మంది మృతి
, బుధవారం, 5 మే 2021 (08:49 IST)
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఆ రాష్ట్రంలో ఈ వైరస్ బారినపడుతున్న కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ కారణంగా ఆక్సిజన్ అందక సంభవిస్తున్న మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. 
 
తాజాగా తమిళనాడులోని చెంగల్‌పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఉదయం ఇలాంటి ఘటనే జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగుల్లో 11 మంది ఆక్సిజన్ అందక మృతి చెందారు. ఆక్సిజన్ సరఫరాలో లోపం కారణంగానే మరణాలు సంభవించినట్టు గుర్తించారు. దీంతో లోపం ఎక్కడ జరిగిందో గుర్తించే పనిలో పడ్డారు. 
 
అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కరోనా బాధితులు మృతి చెందినట్లు వారి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలావుండగా, ఇలా ఆక్సిజన్‌ అందక చాలా మంది రోగులు మృత్యువాత పడుతున్నారు. ముందే దేశంలో కరోనా మహహ్మారి బారిన పడి ప్రాణాల్పోతుంటే ఇలా ఆక్సిజన్‌ అందక ఇబ్బందులకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పబ్ జీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. త్వరలో భారత్‌‍లోకి సూపర్ గేమ్