Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేసిన ఎడప్పాడి - విజయన్

ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేసిన ఎడప్పాడి - విజయన్
, సోమవారం, 3 మే 2021 (12:08 IST)
ఆదివారం వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో తమిళనాడులో అధికార మార్పిడి జరుగగా, కేరళలో మాత్రం ఎల్డీఎఫ్ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. 
 
ఈ క్రమలో ఎన్నిక‌ల్లో చ‌రిత్ర సృష్టించిన ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ సోమ‌వారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్నారు. సీపీఐ (ఎం) రాష్ట్ర సెక్ర‌టేరియ‌ట్ మంగ‌ళ‌వారం స‌మావేశంకానుంది. కొత్త మంత్రివ‌ర్గంతోపాటు విజ‌య‌న్ మ‌రోసారి సీఎంగా ప్ర‌మాణం చేస్తారు. ప్ర‌మాణ స్వీకారోత్స‌వం ఈ నెల 7 నుంచి 10వ తేదీ మ‌ధ్య ఉండే అవ‌కాశం ఉంది.
 
కేర‌ళ‌లో 140 స్థానాల‌కుగాను ఎల్డీఎఫ్ 99 స్థానాల్లో గెలిచి తిరుగులేని మెజార్టీ సాధించిన విష‌యం తెలిసిందే. 40 ఏళ్ల చ‌రిత్ర‌ను తిర‌గరాస్తూ కేర‌ళ‌లో వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌స్తున్నారు పిన‌ర‌యి విజ‌య‌న్‌. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష యూడీఎఫ్ 41 స్థానాల‌కు ప‌రిమితం కాగా.. బీజేపీ ఖాతా కూడా తెర‌వ‌లేక‌పోయింది. గ‌తంలో ఉన్న ఒక్క స్థానంలోనూ కాషాయ పార్టీ ఓడిపోయింది.
 
మరోవైపు, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి కూడా తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. డీఎంకే కూటమి 157 స్థానాల్లో విజయభేరీ మోగించి, పదేళ్ళ తర్వాత అధికారంలోకి రానుంది. దీంతో సీఎం పదవికి ఎడప్పాడి రాజీనామా చేయనున్నారు. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నరుకు పంపించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హత్యకు రెక్కీ .. అయినా భయపడలేదు.. 'సాగర్‌' గెలుపు కేసీఆర్‌ది కాదు : ఈటల