Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

17వ సార్వత్రిక ఎన్నికల ప్రచారం పరిసమాప్తం... 19న పోలింగ్

17వ సార్వత్రిక ఎన్నికల ప్రచారం పరిసమాప్తం... 19న పోలింగ్
, శుక్రవారం, 17 మే 2019 (20:03 IST)
దేశ 17వ సార్వత్రిక ఎన్నికల ప్రచారం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. తుది దశ అంటే ఏడో విడత పోలింగ్ ఈ నెల 19వ తేదీ ఆదివారం జరుగనుంది. ఈ దశలో 8 రాష్ట్రాల్లో 59 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ 19వ తేదీ సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతాయి. 23వ తేదీన సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు అసెంబ్లీ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, తమిళనాడులో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి.
 
కాగా చివరి దశలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 13 స్థానాలు, పంజాబ్‌లో 13 స్థానాలు, వెస్ట్ బెంగాల్‌లో 9, బీహార్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 8, హిమాచల్ ప్రదేశ్‌లో 4, జార్ఖండ్‌లో 3 చొప్పున లోక్‌సభ సీట్లకు పోలింగ్ జరుగుతుంది.  కు పోలింగ్‌ కొనసాగనుంది. యూపీలో మొత్తం 13 స్థానాల్లో 167 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తుది విడతలో పశ్చిమబెంగాల్ లోని 9 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
 
ఈ చివరి దశ పోలింగ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ (వారణాసి)తో పాటు.. కేంద్ర మంత్రి హర్దీప్  సింగ్ పూరి (అమృతసర్), సన్నీడియోల్ (గురుదాస్‌పూర్), కేంద్రమంత్రి హరిసిమ్రత్ కౌర్ (భటిండా), పాట్నాసాహిబ్ స్థానం నుంచి శతృఘ్నసిన్హా (కాంగ్రెస్), బీజేపీ నుంచి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లు బరిలో ఉన్నారు. 59 సీట్లలో మొత్తం 918 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీని కాదు.. అమితాబ్‌ను ఎన్నుకుని ఉండాల్సింది : ప్రియాంకా