Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచంలో ఆర్థిక అస్థిరత - లింక్డిన్ నుంచి 716 మందికి ఉద్వాసన

linkedin
, మంగళవారం, 9 మే 2023 (15:53 IST)
ప్రపంచంలోని పలు దేశాల్లో ఆర్థిక ఆస్థిరత నెలకొంది. దీంతో పలు టెక్ కంపెనీలు ఉద్యోగుల్లో కోత విధిస్తున్నాయి. తాజాగా చైనాకు చెందిన టెక్ కంపెనీ లింక్డిన్ కూడా ఉద్యోగుల్లో కోత విధించింది. ఏకంగా 716 మందికి ఉద్వాసన పలికింది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన సామాజిక మాధ్యమం లింక్డిన్‌ దాదాపు 716 మందికి ఉద్వాసన పలకనున్నట్లు ప్రకటించింది. అలాగే చైనాలో ప్రత్యేకంగా సేవలు అందిస్తున్న జాబ్‌ అప్లికేషన్‌ను మూసివేస్తున్నట్లు తెలిపింది.
 
లింక్డిన్‌‌లో 20 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత ఏడాది ప్రతి త్రైమాసికంలో కంపెనీ ఆదాయంలో వృద్ధి నమోదైంది. అయినప్పటికీ.. ఉద్యోగుల తొలగింపు విషయంలో మాత్రం ఇతర కంపెనీల బాటలోనే నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితే దీనికి కారణంగా తెలుస్తుంది. కార్యకలాపాలను ప్రామాణీకరించడంతో పాటు వేగవంతమైన నిర్ణయాల కోసం వివిధ అంచెలను తగ్గించడం కోసమే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ సీఈఓ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఉద్యోగులకు లేఖ రాశారు.
 
చైనాలో సవాల్‌తో కూడుకున్న పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో 'ఇన్‌కేరీర్స్‌' అనే జాబ్‌ యాప్‌ను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు లింక్డిన్‌ తెలిపింది. 2021లోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఇప్పుడు దీన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చింది. ఆగస్టు 9 నాటికి దశలవారీగా యాప్‌ను పూర్తిగా తొలగించనున్నట్లు స్పష్టంచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు