Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో తొలి 5జీ స్మార్ట్ ఫోన్... రెడ్‌మి నోట్ 10టి 5G

Advertiesment
Samsung Galaxy A22
, శుక్రవారం, 23 జులై 2021 (18:29 IST)
5g smart phone
దేశంలో నంబర్ వన్ స్మార్ట్‌ ఫోన్, స్మార్ట్ టీవీ బ్రాండ్ ఎంఐ ఇండియా సబ్ బ్రాండ్ రెడ్‌మి ఇండియా తన తొలి 5G స్మార్ట్‌ఫోన్‌- రెడ్‌మి నోట్ 10టి 5Gను భారతదేశంలో విడుదల చేసింది. 
 
రెడ్‌మి నోట్ 10 సిరీస్‌లో సరి కొత్త ఎడిషన్‌గా అందుబాటులోకి వస్తున్న రెడ్‌మి నోట్ 10టి 5G డైమెన్షన్ 700 చిప్‌సెట్‌ను, ఇమ్మర్సివ్ 90 హెడ్జ్ 6.5' అడాప్టివ్‌ సింక్ డాట్‌ డిస్‌ప్లే అలాగే 48 ఎంపి కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. వినియోగదారులకు వేగవంతమైన మరియు ఫ్యూచరిస్టిక్ అనుభవాన్ని అందించే హామీతో, ఇది 5G శకం పనితీరు ప్రమాణాలను అధిగమించేలా తయారు చేశారు. 
 
నూతన ఉత్పత్తి విడుదల గురించి రెడ్‌మి ఇండియా బిజినెస్ హెడ్ స్నేహ తైన్వాలా మాట్లాడుతూ రెడ్‌మి నోట్ 10టి 5G అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా మేము రెడ్‌మి నుంచి మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులకు అందిస్తున్నాము. 
 
తన మునుపటి తరం అనుభవాల నుంచి, స్మార్టఫోన్ పనితీరు-కేంద్రీకృత లక్షణాలు మరియు రూపకల్పనల సంపూర్ణ సమ్మేళనాన్ని ఇది అందిస్తుంది. బహు ముఖ కెమెరా మరియు 90 హెడ్జ్ 6.5' అడాప్టివ్‌ సింక్ డాట్‌ డిస్‌ప్లేతో ఉత్తమ-ఇన్-క్లాస్ హార్డ్‌వేర్‌ను కలుపుతూ, రెడ్‌మి నోట్ 10 సిరీస్‌కు తాజా ఎడిషన్ అత్యుత్తమ అనుభవాన్ని వినియోగదారునికి అందిస్తుంది.
 
రెడ్‌మి నోట్ 10 సిరీస్ ఆఫ్ క్యారీ ది లెగసీ, ది రెడ్‌మి నోట్ 10టి 5G అదే EVOL డిజైన్ లాంగ్వేజ్‌ లవ్‌ను కలిగి ఉంది. రెడ్‌మి నోట్ 10టి 5G నాలుగు ఆకర్షణీయమైన వర్ణాలు - మెటాలిక్ బ్లూ, మింట్ గ్రీన్, క్రోమియం వైట్ మరియు గ్రాఫైట్ బ్లాక్‌లలో లభిస్తుంది. ఇది 3.5మి.మీ హెడ్‌ ఫోన్ జాక్ మరియు కార్నింగ్  గొరిల్లా  గ్లాస్‌తో అందుబాటులోకి వస్తుండగా, ఇది ప్రమాదవశాత్తు పడే నీటి నుంచి, గీతల నుంచి మరింత నిరోధకతను అందిస్తుంది.
 
రెడ్‌మి నోట్ 10టి 5G 2021 జూలై 26 మధ్యాహ్నం 12:00 గంటల నుంచి ప్రారంభమయ్యే ఎంఐ.కామ్, అమెజాన్.ఇన్, ఎంఐ హోమ్ మరియు ఎంఐ స్టూడియో స్టోర్లలో లభిస్తుంది. వీటితో పాటు 10,000+ రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటుంది. ప్రారంభిక పరిచయ ధర 4GB + 64GB వేరియంట్‌కు రూ.13,999, 6GB + 128GBకి రూ.15,999 కలిగి ఉంది. అదనంగా, హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్-కార్డ్ సభ్యులు రూ.1000 వరకు తగ్గింపు పొందవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

5 లక్షల 20 వేల మంది ఇంట‌ర్ విద్యార్థులు పాస్