Publish Date: Thu, 21 Oct 2021 (15:02 IST)
Updated Date: Thu, 21 Oct 2021 (19:06 IST)
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త. ఇకపై పర్సనల్ కంప్యూటర్ (పీసీ)లోనూ ఇన్స్టాగ్రామ్ యాప్ను ఉపయోగించుకునే వెసులుబాటును తీసుకొచ్చారు.
దాంతో ఇక ఇన్స్టాగ్రామ్లో వెబ్ వెర్షన్ ద్వారా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే అవకాశం వచ్చింది. తొలుత ఎన్ గాడ్జెట్లో కనిపించిన ఈ ఫీచర్.. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది.
ఇంతకు ముందు కంప్యూటర్ల నుంచి స్మార్ట్ఫోన్కు పంపించుకున్నాకే ఇన్స్టాలో ఫొటోలను అప్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇకపై పర్సనల్ కంప్యూటర్లలో ఎడిట్ చేసుకున్న ఫొటోలను డైరెక్ట్ గా అప్లోడ్ చేయొచ్చు.