Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబై డ్రగ్స్ కేసు : చిక్కుల్లో విజయ్ దేవరకొండ హీరోయిన్

ముంబై డ్రగ్స్ కేసు : చిక్కుల్లో విజయ్ దేవరకొండ హీరోయిన్
, గురువారం, 21 అక్టోబరు 2021 (14:12 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారం ఇపుడు మరో మలుపు తిరిగింది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ కేసులో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 
 
బాలీవుడ్ బాద్ షా షారూక్ నివాసంపై కొద్ది సేపటి క్రితం ఎన్‌సీబీ అధికారులు దాడులు చేశారు. బాంద్రాలో ఉన్న షారూక్ నివాసం మన్నత్‌కు ఎన్‌సీబీ అధికారలు వచ్చి గాలింపులు చేపడుతున్నారు. అలాగే బాలీవుడ్ కథానాయిక అనన్యా పాండే ఇంటికి కూడా ఎన్‌సీబీ టీమ్ చేరుకుంది. 
 
సీనియర్ నటుడు చుంకీ పాండే కుమార్తె అయిన అనన్య.. ఆర్యన్‌కు మంచి స్నేహితురాలు. ఆర్యన్ ఫోన్ చాటింగ్‌లో అనన్య పేరు ఉన్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. వీరిద్దరి మధ్య జరిగిన చాటింగ్ సంభాషణలను కూడా కోర్టుకు ఎన్సీబీ అధికారులు ఓ నివేదిక రూపంలో సమర్పించారు. 
 
ఈ నేపథ్యంలో ముంబైలోని ఖార్ వెస్ట్‌లో ఉన్న ఆమె ఇంటిపై కూడా ఎన్‌సీబీ అధికారులు దాడులు చేశారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా అనన్యను ఆదేశించారు. ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న కొడుకును షారూక్ కలిసిన కొద్ది గంటలకే ఈ దాడులు జరగడం విశేషం. కాగా, అనన్య పాండే హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'ఫైటర్' చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా - స‌భ్యుల కోసం మంచు విష్ణు కీల‌క నిర్ణ‌యం