Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొండిపట్టు వదిలిన ట్విట్టర్-కేంద్ర ఐటీ విధానాలకు గ్రీన్ సిగ్నల్

మొండిపట్టు వదిలిన ట్విట్టర్-కేంద్ర ఐటీ విధానాలకు గ్రీన్ సిగ్నల్
, సోమవారం, 31 మే 2021 (18:07 IST)
కేంద్ర ప్రభుత్వ ఐటీ విధానాలకు ట్విట్టర్ యాజమాన్యం ఎట్టకేలకు అంగీకరించింది. సామాజిక మాధ్యమాల కట్టడికి కేంద్రం కొత్తగా ఐటీ విధానాలను అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫేస్‌బుక్ సహా పలు సోషల్ మీడియా, ఓటీటీ సంస్థలు ఈ నియమావళిని అంగీకరించాయి.

అయితే వీటిలో కొన్ని మార్పులు చేయాలంటూ ప్రతిపాదనలు పెట్టాయి. అయితే ఈ విషయంలో ట్విట్టర్ యాజమాన్యం కాస్త మొండిగా వ్యవహరించింది. ఇదే తరహాలో ట్విట్టర్ కూడా ఐటీ విధానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
సామాజిక మాధ్యమాల కట్టడికి మూడు నెలల క్రితం, అంటే ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వాటి అమలుకు కేంద్రం ఇచ్చిన మూడు నెలల గడువు మే 25తో ముగియడంతో కేంద్ర ప్రభుత్వం మే 26న రంగంలోకి దిగింది. 
 
సవరించిన నిబంధనల అమలుకు సామాజిక మాధ్యమాలు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని ప్రశ్నించింది. అయితే అప్పటి వరకు మౌనంగా ఉన్న ఫేస్‌బుక్ ఉన్నట్లుండి కేంద్ర నియమావళికి ఓకే చెప్పేసింది.

అయితే ఇదే సమయంలో ట్విట్టర్ కార్యాలయంలో ఢిల్లీ పోలీసులు తనిఖీకి రావడం సంచలనంగా మారింది. అనంతరం తమ ఉద్యోగుల భద్రతపై, వాక్స్వాతంత్ర్యానికి కలుగుతున్న ముప్పుపై ఆందోళన కలుగుతోందని ట్విట్టర్ ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గంగానదిలో కొట్టుకొస్తున్న కరోనా మృతుల శవాలు