Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ 2020 : చతికిలపడిన సన్ రైజర్స్ - కోల్‌కతా విజయం

ఐపీఎల్ 2020  : చతికిలపడిన సన్ రైజర్స్ - కోల్‌కతా విజయం
, ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (11:41 IST)
ఐపీఎల్ 2020 టోర్నోలో భాగంగా శనివారం రాత్రి అబుదాబీ వేదికగా జరిగన ఎనిమిదో లీగ్ మ్యా‌లో స్వల్ప స్కోర్లే నమోదయ్యాయి. ప్రత్యర్థి జట్టు ఉంచిన స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ అలవోకగా సాధించింది. దీంతో కేకేఆర్ విజయాన్ని నమోదు చేయగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం ఈ టోర్నీలో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. అదేసమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
 
టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు మొదట్లోనే జానీ బెయిర్‌ స్టో వికెట్‌‌ను కోల్పోయింది. ఆపై వార్నర్‌‌కు జత కలిసిన మనీష్‌ పాండే, సహా, దాని తర్వాత సాహాల జోడీ ముందుకు సాగుతున్నట్టు కనిపించినా, కేకేఆర్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ ముందు వారి ఆట సాగలేదు. 15 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసిన సన్ రైజర్స్, స్లాగ్‌ ఓవర్లలో పరుగులు సాధించలేక తడబడింది. ఫలితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 143 పరుగులు సాధించింది. 
 
దీన్ని కేకేఆర్ మరో 2 ఓవర్లు మిగిలివుండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంలో శుభమన్‌ గిల్ 70 పరుగులు, నితీష్‌ రాణా 26 పరుగులతో తమదైన పాత్ర వహించగా, ఇయాన్‌ మోర్గాన్‌ 42 పరుగులతో నాటౌట్ గా నిలిచి లాంఛనాన్ని పూర్తి చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాయుడు లేని లోటు కనిపిస్తోంది.. అందుకే ఓటములు : ధోనీ