Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెల్ఫీ పేరుతో కొండ అంచుకు తీసుకెళ్లి భార్యను కిందకు తోసేసిన భర్త...

సెల్ఫీ పేరుతో కొండ అంచుకు తీసుకెళ్లి భార్యను కిందకు తోసేసిన భర్త...
, గురువారం, 18 ఫిబ్రవరి 2021 (16:47 IST)
టర్కీలో ఓ దారుణం జరిగింది. ఓ భర్త కట్టుకున్న భార్యను హత్య చేసేందుకు ఓ ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్ ప్రకారం తన భార్యను సెల్ఫీ తీసుకుందాంమంటూ కొండ అంచుకు తీసుకెళ్లి, అక్కడ నుంచి కిందికి తోసేశాడు. కేవలం భార్యకు వచ్చే బీమా సొమ్ముకు ఆశపడి ఆ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, టక్కీకి చెందిన వ్యక్తికి భార్య ఉంది. ఈమె గర్భందాల్చివుంది. అయితే, ఆమె మరణించాక వచ్చే బీమా సొమ్ము కోసం ఆశపడ్డాడు. ఇందుకోసం ఆమెను హతమార్చాలని ప్లాన్ వేశాడు. 
 
ఇందులోభాగంగా, సెల్ఫీ తీసుకుందామని చెప్పిన ఆమెను కొండ అంచువరకూ తీసుకెళ్లాడు. దాదాపు మూడు గంటల పాటు అక్కడే ఎదురుచూసీ, చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక ఆమెను కిందకు తోసేశాడు. దీంతో ఆమె చనిపోయింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు పూర్తి సమాచారం సేకరించి కోర్టుకు అందించారు. భార్య తీసుకున్న బీమా పాలసీల్లో నామినీగా భర్త హక్కాన్ పేరు మాత్రమే ఉంది. దీంతో ఆమెను చంపేస్తే బీమా సొమ్ము మొత్తం తనకే వస్తుందన భావించి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. 
 
అయితే.. హక్కాన్ అయాసల్ మాత్రం తాను నిర్దిషి అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కేవలం సంతకాల కోసమే భార్యకు ఇన్సురెన్సు డాక్యుమెంట్లు ఇచ్చానని, తతిమా వ్యవహారమంతా ఇన్సూరెన్స్ సంస్థ ఏజెంటే చూసుకున్నాడని చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో సాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ వేలం నేడే: ఈసారి వేలానికి వస్తున్న ఆటగాళ్లు ఎవరు, కాసుల వర్షం ఎవరిపై కురియనుంది?