Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైమానిక స్థావరాలే లక్ష్యంగా పాక్ ఉగ్రమూకల దాడికి ప్లాన్

Advertiesment
Pakistan
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోమారు భారత్‌పై విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నారు. ఇండోపాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న భారత వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడేందుకు ప్లాన్ వేసినట్టు సమాచారం. ఈ కుట్రకు జైషే మొహ్మద్ తీవ్రవాద సంస్థ కార్యాచరణ రూపొందించినట్టు సమాచారం. దీంతో కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. 
 
ఈ దాడిలో భాగంగా, జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్, అవంతిపురా ఎయిర్ బేస్‌లను లక్ష్యంగా చేసుకుని దాడుల చేసేందుకు పాక్ ఉగ్రవాదులు పథకాలను రచిస్తున్నారని ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఈ రెండు ఎయిర్‌బేస్‌ల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసి హైఅలర్ట్ ప్రకటించారు. 
 
మరోవైపు, చారిత్రాత్మక ఇస్లామిక్ యుద్ధం 'బదర్'ను పురస్కరించుకుని జరుపుకునే వేడుకకు ముందే ఈ దాడి జరిగే అవకాశం ఉంది. మహమ్మద్ ప్రవక్త సాధించిన తొలి మిలిటరీ విజయమే బదర్. ఈ నెల 23న ఈ వేడుక జరగనుంది. పుల్వామా ఘటనకు పాల్పడిన జైషే మొహమ్మద్ ఈ దాడులకు స్కెచ్ వేసినట్టు ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈనెల 23వ తేదీనే దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడితే రాజీనామా : పంజాబ్ సీఎం