Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాబూల్‌లో ఐఎస్ఐ పర్యటన : పాక్ చేతిలో కీలుబొమ్మగా తాలిబన్లు

కాబూల్‌లో ఐఎస్ఐ పర్యటన : పాక్ చేతిలో కీలుబొమ్మగా తాలిబన్లు
, ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (12:33 IST)
ఆప్ఘనిస్థాన్‌ తాలిబన్లు కీలుబొమ్మగా మారారు. ఇప్పటికే పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ ఫయీజ్‌ అహ్మద్‌ కాబూల్‌లో పర్యటించారు. ఆఫ్ఘన్‌లో తాలిబన్లు తాము చెప్పినట్టు నడుచుకునే విధంగా పాక్‌ ఐఎస్‌ఐ ట్రయినింగ్‌ ఇస్తోంది. 
 
ఐఎస్‌ఐ చీఫ్‌ జనరల్ ఫయీజ్ హమీద్ అకస్మాత్తుగా కాబూల్‌లో పర్యటించారు. ప్రభుత్వ ఏర్పాటుతో పాటు పంజ్‌షేర్‌ వ్యాలీలో యుద్దాన్ని సమీక్షించేందుకు కాబూల్‌కు ఫయీజ్‌ అహ్మద్‌ వచ్చారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పంజ్‌షేర్‌ లోయ మినహా మిగతా ప్రాంతమంతా తాలిబన్ల కబ్జాలో ఉంది. 
 
అంతేకాదు, పంజ్‌షేర్‌ వ్యాలీలో తాలిబన్లకు పాకిస్థాన్‌ అన్నివిధాలా సాయం చేస్తోంది. అల్‌ఖైదా ఉగ్రవాదులతో పాటు పాక్‌ సైనికులు కూడా తాలిబన్ల తరపున పోరాటం చేస్తునట్టు తెలుస్తోంది.
 
మరోవైపు, తాలిబన్ల ప్రభుత్వంలో ఎవరు ఏ పదవి చేపట్టాలన్న విషయంపై కూడా నిర్ణయించేది పాక్‌ ఐఎస్‌ఐ అని ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యం జరుగుతున్నట్టు చెబుతున్నారు. పంజ్‌షీర్ లోయలో తాలిబన్లు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సమయంలో జనరల్ ఫయీజ్ కాబూల్‌లో పర్యటిస్తున్నారు.
 
ఆందోళన చేస్తున్న మహిళలు వెనక్కి వెళ్లిపోవాలని తాలిబన్‌ నేతలు హెచ్చరించారు. అయితే వాళ్ల బెదిరింపులకు డేర్‌ డెవిల్ లేడీస్‌ భయపడలేదు. తాలిబన్‌ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. తాలిబన్ లీడర్‌ చేతి నుంచి మైక్‌ లాక్కొని వాళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో అధికార వైకాపా పార్టీ నేత దారుణం హత్య