Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుల్‌భూషణ్ జాదవ్‌‌ కేసులో పాకిస్థాన్ అలా చేస్తోంది..

కుల్‌భూషణ్ జాదవ్‌‌ కేసులో పాకిస్థాన్ అలా చేస్తోంది..
, గురువారం, 23 జులై 2020 (22:35 IST)
భారత నావికా దళం మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ శిక్షను పునఃసమీక్షించాలని పాకిస్థాన్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశించింది. ఈ నేపథ్యంలో మిలిటరీ కోర్టు తీర్పుపై అపీలు చేయవలసి ఉంది. అయితే ఈ కేసులో చట్టపరమైన అన్ని అవకాశాలను పాకిస్థాన్ అడ్డుకుంటోందని భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, జూలై 16న భారత దేశ కాన్సులర్ ఆఫీసర్లు జాదవ్‌ను కలిసినపుడు పాకిస్థాన్ అధికారులు అడ్డంకులు సృష్టించారన్నారు. ఈ కేసు పట్ల పాకిస్థాన్ వ్యవహార శైలి ఓ ప్రహసనంగా ఉందని పేర్కొన్నారు. జాదవ్ నుంచి పవరాఫ్ అటార్నీ తీసుకోవడానికి సైతం భారత దేశానికి అవకాశం ఇవ్వలేదన్నారు.
 
జాదవ్ నుంచి పవరాఫ్ అటార్నీని తీసుకోలేకపోవడం వల్ల మరణ శిక్షపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం సాధ్యం కాదని ఈ కేసులో భారత్ తరపున వాదిస్తున్న పాకిస్థానీ లాయర్ చెప్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తదుపరి అనుసరించదగిన అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త కోసం రోడ్డుపై పరుగెత్తిన భార్య, ఇంకో మహిళతో వెళ్ళిపోయిన భర్త, తండ్రి వద్దంటూ కూతురు