Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొరాకోకు భారీ భూకంపం: 1,037 మంది మృతి

earthquake
, శనివారం, 9 సెప్టెంబరు 2023 (19:14 IST)
మొరాకోను గత రాత్రి భారీ భూకంపం ఏర్పడింది. ఈ భూకంపం ధాటికి మృతి చెందినవారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 1,037 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం ధాటికి 1,200 మంది క్షతగాత్రులయ్యారని, గాయపడ్డవారిని ఆసుపత్రులకు తరలించినట్టు తెలిపారు.
 
మరకేష్ వద్ద 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలను కలుగజేసింది. మొరాకోలో గత 120 ఏళ్లలో ఇదే అతి పెద్ద భూకంపమని తెలిపారు. 
 
రిక్టర్ స్కేలుపై 6.8 అనేది ఓ మోస్తరు తీవ్రతే అయినప్పటికీ, ఇక్కడి భవనాలు, ఇళ్లు పాతకాలం నాటివి కావడంతో నష్టం భారీగా జరిగిందని అధికారులు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏసీబీ కోర్టుకు చంద్రబాబు.. వాదనలు వినిపించనున్న సిద్ధార్థ లూథ్రా