Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ అమ్మాయి తల్లిదండ్రులను ఎదురుగా పెట్టుకుని మందేసింది.. ఆ తర్వాత?

ఈ అమ్మాయి తల్లిదండ్రులను ఎదురుగా పెట్టుకుని మందేసింది.. ఆ తర్వాత?
, గురువారం, 21 మార్చి 2019 (17:47 IST)
భారత్‌కి చెందిన మిషా మాలిక్‌ కొలంబియా దేశంలో నివసిస్తోంది. కాగా రెండు రోజుల క్రితం తన ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. దీనిలో మిషా తన తల్లిదండ్రుల ఎదురుగా కూర్చుని మద్యం సేవిస్తోంది. మరో వైపు మిషా తల్లి.. కూతురిని తాగవద్దని బతిమిలాడటం వినిపిస్తుంది. 
 
ఎంత మోడ్రన్‌గా ఉన్నప్పటికీ.. ఆధునికంగా ఆలోచించినప్పటికీ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఇండియన్‌ పేరెంట్స్‌ మార్పుని అంగీకరించరు. ముఖ్యంగా ఆడపిల్లలు మద్యం సేవించే విషయాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేరు. 
 
సాధారణంగా మద్యపానం అనేది మగవారికి మాత్రమే అని సమాజం ఏళ్ల తరబడి నమ్ముతోంది. అయితే ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్‌ మారుతున్నప్పటికీ మన సమాజంలో నేటికీ నూటికి 95 శాతం కుటుంబాల్లో ఆడవారు తాగకూడదు అనే నియమం చాలా కఠినంగా పాటిస్తారు. ఒకవేళ అందుకు భిన్నంగా జరిగితే తల్లిదండ్రుల రియాక్షన్‌ ఇలా ఉంటుందని మిషా మాలిక్ అంటున్నారు‌.
 
తల్లిదండ్రుల ముందు కూర్చొని మందు కొట్టడం వల్ల ‘మా అమ్మానాన్నలు నన్ను ఇండియా తిరిగి పంపిచడానికి టికెట్లు బుక్‌ చేసారు’ అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇండియన్‌ పేరెంట్స్‌ అంటేనే ఓవర్‌ కేరింగ్‌ అని నిరూపించుకున్నారం’టూ నెటిజన్లు కామెంట్‌లు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫోటోలకు ఫోజులిస్తుంటే... ఎత్తిపడేసిన రాకాసి అల (Video)