Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుల్‌భూషణ్ జాదవ్ నిర్బంధం అక్రమం : పాక్‌కు ఝలక్ ఇచ్చిన ఐసీజే

కుల్‌భూషణ్ జాదవ్ నిర్బంధం అక్రమం : పాక్‌కు ఝలక్ ఇచ్చిన ఐసీజే
, గురువారం, 31 అక్టోబరు 2019 (15:45 IST)
పాకిస్థాన్‌కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీజే) తేరుకోలేని షాకిచ్చింది. గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ చెరలో ఉంటోన్న భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాకిస్థాన్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొంది. పైగా, కుల్‌భూషణ్ నిర్బంధం అక్రమమని తేల్చింది. పైగా, దీనిపై తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పాకిస్థాన్‌ను ఆదేశించింది. 
 
భారత గూఢచార సంస్థ 'రా' కోసం గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ కుల్‌భూషణ్‌ను 2016 మార్చి 3వ తేదీన పాకిస్థాన్ అరెస్టు చేసిన విషయం తెల్సిందే. అనంతరం 2017లో పాక్ మిలిటరీ న్యాయస్థానం ఆయనకు మరణశిక్ష విధించింది. దీనిపై అభ్యంతరాలు తెలిపిన భారత్.. నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో సవాల్ చేయడంతో దీనిపై విచారణ జరిగింది. 
 
ఈ కేసులో పాకిస్థాన్ పునఃసమీక్ష చేసే వరకు కుల్ భూషణ్ మరణశిక్ష అమలుపై అప్పట్లో ఐసీజే స్టే విధించింది. భారత్ సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. పాక్ దిద్దుబాటు చర్యలు చేపట్టాలంటూ గురువారం ఆదేశాలు జారీచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వచ్చే 72 గంటల్లో దక్షిణాది రాష్ట్రాలకు పెనుముప్పు