Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీచ్‌కు వచ్చి బాగా ఎంజాయ్ చేశారు.. ఇప్పుడేమో ఎయిర్‌హోస్టులు ఫిర్యాదు చేస్తే ఎలా?

బీచ్‌కు వచ్చి బాగా ఎంజాయ్ చేశారు.. ఇప్పుడేమో ఎయిర్‌హోస్టులు ఫిర్యాదు చేస్తే ఎలా?
, శనివారం, 23 మార్చి 2019 (18:43 IST)
న్యూయార్క్ నగరంలో ఇద్దరు ఎయిర్‌హోస్టులపై పైలట్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఏడాది మే 9వ తేదీన ఈ ఘటన జరిగినా.. పైలట్లు మాత్రం ఎదురుతిరిగారు. తమతో కలిసి బీచ్‌లో బాగా ఎంజాయ్ చేసి.. ప్రస్తుతం ఫిర్యాదు చేస్తున్నారన్నారు. 
 
ఈ వ్యవహారాన్ని ఎయిర్‌‌లైన్స్ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ పైలట్లను బాధితులు వదిలిపెట్టలేదు. న్యాయపోరాటం చేశారు. చివరికి సదరు పైలట్లపై చర్యలు తీసుకునేందుకు జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్ సంస్థ అంగీకరించింది. ఉద్యోగుల భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తామని తెలిపింది. 
 
వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ కేంద్రంగా పని చేసే జెట్‌ బ్లూ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే ఇద్దరు పైలట్లు.. వాషింగ్టన్ నగరం నుంచి ప్యూర్టోరికో ఏరియాకు చేరారు. ఎయిర్‌హోస్టర్స్, పైలట్స్ కలిసి ఓ హోటల్‌లో బస చేశారు. సాయంత్రం వేళ సరదాగా బీచ్‌కు సరదాగా వెళ్లారు. యువతలతో కలిసి బీచ్‌కు వెళ్లిన పైలట్స్ అక్కడ సరదాగా ఎంజాయ్ చేశారు. 
 
తాగేందుకు శీతల పానీయాలు తీసుకొచ్చిన పైలట్స్... అందులో డ్రగ్స్ కలిపారు. డ్రగ్స్ మత్తులో ఉన్న యువతులపై బీచ్‌లోనే అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటన జరిగిన తర్వాత పైలట్లపై జెట్‌బ్లూ ఎయిర్‌‌లైన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు బాధితులు. అయినా అధికారులు పట్టించుకోలేదు. కానీ తొమ్మిదినెలల తర్వాత ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏం తిరిగారో? ఏకంగా 92 దేశాలు.. మోదీ గారూ.. అదరగొట్టారే?!