Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలాకోట్‌లో జీహాదీలకు జైషే శిక్షణ

Advertiesment
Jaishey
, సోమవారం, 23 సెప్టెంబరు 2019 (06:30 IST)
భారత్‌పై ఉగ్ర దాడులకు 40 మంది జీహాదీలకు జైషే మొహమ్మద్ ఉగ్రవాది సంస్థ శిక్షణ ఇస్తోంది. ఇటీవల భారత వాయిసేన దాడి చేసిన బాలాకోట్‌లోని జైషే స్థావరం వద్దే ఈ శిక్షణ చురుకుగా సాగుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల తాజా సమాచారం.

జమ్మూకశ్మీర్‌తో పాటు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు లక్ష్యంగా ఉగ్రవాదులకు జైషే శిక్షణ ఇస్తోందని ఆ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, కొన్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు భారత్‌లోని పలు ప్రాంతాలపై దాడులకు పాక్ వ్యూహరచన చేస్తున్నట్టు గత కొద్దిరోజులుగా ఇంటెలిజెన్స్ శాఖ సమాచారం అందిస్తూ వస్తోంది.
 
పాక్ జాతీయుడి అరెస్టు
అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ పాక్ జాతీయుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతని పేరు బష్రత్ అలీగా గుర్తించారు.

అనుమానితుడి వద్ద ఎలాంటి ఆయుధాలు దొరకలేదని తెలిపారు. జమ్ము కశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ పాకిస్థానీని పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ సియాల్కోట్కు చెందిన ఈ యువకుడి పేరు బష్రత్ అలీగా పోలీసులు గుర్తించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్‌ రాజీనామా చేయాలి : చంద్రబాబు డిమాండ్