Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకే పడకపై ఇద్దరు యువతులతో మజా.. కానీ సాకు మాత్రం బల్లిపై నెట్టేశాడు..

Advertiesment
Man
, శనివారం, 14 సెప్టెంబరు 2019 (14:27 IST)
ఇద్ద‌రు యువ‌తుల‌తో అభ్యంత‌ర‌క‌ర స్థితిలో కనిపించిన ఓ యువకుడు.. తాను చేసిన తప్పును ఒప్పుకోకుండా బల్లిపై తప్పును నెట్టేశాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? మ‌లేషియాలో పెర్హింతియ‌న్ ఐల్యాండ్స్‌లో ఓ యువ‌కుడు (20) ఇద్ద‌రు యువ‌తుల‌తో శృంగారం చేస్తుండ‌గా పోలీసులు ఆ కాటేజీపై దాడి చేసి ఆ ముగ్గురినీ అరెస్టు చేశారు.
 
అయితే పోలీసుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా ఆ వ్యక్తి మాత్రం బల్లిపై సాకు పెట్టాడు. త‌న కాటేజీలో బ‌ల్లి ఉంద‌ని, బ‌ల్లి అంటే త‌న‌కు భ‌య‌మ‌ని, అందుక‌నే ఆ ఇద్ద‌రు యువ‌తుల కాటేజీలో వారితో క‌లిసి ప‌డుకున్నాన‌ని చెప్పి బుకాయించ‌బోయాడు. కానీ పోలీసులు న‌మ్మ‌లేదు. ఎందుకంటే ఆ ముగ్గురూ క‌లిసే రెండు కాటేజీలు బుక్ చేసుకున్నారు. 
 
కానీ ముగ్గురూ ఒకే గ‌దిలో ప‌డుకున్నారు. దీనికి తోడు ఆ యువ‌కుడు బ‌ల్లి క‌హానీ వినిపించాడు. అందుక‌నే పోలీసులు న‌మ్మ‌లేదు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు త‌ర‌లిచారు. మ‌లేషియాలో ష‌రియా లా ప్ర‌కారం.. వివాహం కాని స్త్రీ, పురుషులు ఎక్క‌డా, ఎలాంటి స్థితిలోనూ ఒకే ఇల్లు లేదా గ‌దిలో అభ్యంత‌ర‌క‌ర, అనైతిక స్థితిలో ఉంటే నేరమవుతుంది. అందుక‌నే ఆ ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రాణం తీసిన బ్యానర్.. శుభశ్రీ కెనడా పోవాల్సింది.. ఇంతలో..