Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డోక్లాం వివాదం తర్వాత జిన్‌పింగ్‌తో నరేంద్ర మోడీ భేటీ

చైనాలోని షియామెన్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. భారత్ చైనాల మధ్య తలెత్తిన డోక్లాం వివాదం తర్వాత జరిగనున్న తొల

Advertiesment
Narendra Modi
, మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (11:28 IST)
చైనాలోని షియామెన్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. భారత్ చైనాల మధ్య తలెత్తిన డోక్లాం వివాదం తర్వాత జరిగనున్న తొలి సమావేశం కావడం గమనార్హం. ఇందులో ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపనున్నారు. ముఖ్యంగా డోక్లాం వివాదం తర్వాత రెండు దేశాల అధినేతలు కలుసుకోనుండటం ఇదే తొలిసారి. 
 
మయాన్మార్‌కు బయలుదేరే ముందు ప్రధాని మోడీ మధ్యాహ్నం 12.30 గంటలకు జిన్‌పింగ్‌తో సమావేశమవుతారని భారత విదేశాంగశాఖ అధికారులు తెలిపారు. అయితే చర్చాంశాలు వెల్లడించేందుకు వారు నిరాకరించారు. ఇటీవల సిక్కిం సమీపంలోని డోక్లాంలో భారత, చైనా దళాలు నువ్వానేనా అన్నట్టుగా మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. 
 
ఇదిలావుండగా, బ్రిక్స్ శిఖరాగ్ర సభ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో విడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారు ద్వైపాక్షిక వాణిజ్య అభివృద్ధి, పెట్టుబడులపై ప్రధానంగా చర్చించారు. ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితి కూడా ప్రస్తావనకు వచ్చిందని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్ మీడియాకు తెలిపారు. బ్రెజిల్ అధ్యక్షుడు మైకేల్ టెమర్‌తోనూ ప్రధాని మోడీ విడిగా సమావేశమయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగ్రవాదంపై దిగివచ్చిన చైనా.. జాబితాలో లష్కరే తాయిబా, జైషేమహ్మద్